గౌతమి పుత్ర శాతకర్ణి – Part 3

Posted on

అప్పుడు ఋష్యముఖి పర్వతం పైకి వెళ్ళాడు శాతకర్ణి.
అక్కడ మాతంగ మహర్షి ఆశ్రమం ఉంది. ఆయన వారసులు ఉన్నారు.
అప్పుడు శాతకర్ణి మునులతో చెప్పారు. “నేను శాలివాహన రాకుమారుడిని దీపంతో నూనె కాకుండా జలంతో వెలగాలి.దీపాన్ని వెలిగించే జలాన్ని అన్వేషించ వచ్చాను, కాబట్టి మీరు మార్గం చూపించాలి” అని అన్నారు. ఇక్కడి కొలనులోని జలాన్ని శివుని ఆత్మలింగంపై అభిషేకించాలి అప్పుడు ఆనీటికి దీపాన్ని వెలిగించే శక్తి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఒక కొలను చూపించి ఈ జలం తీసుకోండి అన్నారు. కొలనులో నీళ్ళు లేవు. ప్రతీ సంవత్సరం మార్గశిర ఏకాదశి నాడు ఆకాశగంగ ఇక్కడకు వస్తుంది, ఆ ఆకాశగంగని తీసుకోవడానికి పాత్ర మాత్రం తెల్ల ఆవునుండి తయారుచేసినదై ఉండాలి, కానీ ఆ జంతువు రక్తం మాత్రం చిందకూడదు. ఆ రక్తం ఈ ఆశ్రమ భూమిపై చిందితే ఈ ఆశ్రమం శాపం నీకు తగులుతుంది అన్నాడు.

అప్పుడు, శాతకర్ణి బాగా ఆలోచించి ఆవు కొమ్ముతో నీళ్ళు పడదాము అని చెప్పి, కానీ రక్తం రాకుండా వాటిని తీయడమెలా అని ఆలోచించి సోమవజ్రానికి అనంతశక్తి ఉంది. ఆ శక్తిని చిన్న కిరణంలా మారిస్తే అని తలచి ఒక సీసపు పెట్టెలో వజ్రాన్ని పెట్టి మూసాడు. తన ఆత్మ శక్తితో వెలిగించాడు. అందులోనుంచి ఒక కిరణం వచ్చింది. ఆ కిరణం శక్తికి చెట్టు పడిపోయింది ;మెల్లగా కొమ్మును ఆ కిరణం సాయంతో కత్తిరించాడు.
రక్తం రాకుండా తెగిపోయింది కొమ్ము.
మార్గశిర ఏకాదశి రానేవచ్చింది, ఆ కొమ్ముతో నీరు పట్టి, ప్రమిద వెలిగించాడు శాతకర్ణి.
ఇప్పుడు ఆ దీపాన్ని ఆకాశంలో మూడు వెలుతురులు మధ్య పెట్టాలి అది ఎక్కడ అని ఆలోచించసాగాడు.
అప్పుడు శాతకర్ణి ఆలోచించాడు, పరశురాముడు కేరళ ప్రాంతాన్ని నిర్మించాడు కదా, అక్కడకు వెళ్ళి వెతుకుదాము అని బయలుదేరాడు.

దారిలో ఒక పండితుడు శాతకర్ణికి కనిపించాడు. ఆయన దుర్భిణిలో చుక్కలను చూస్తున్నాడు. అప్పుడు శాతకర్ణి ఆయనకు నమస్కరించి స్వామీ మీరు ఏమి చేస్తున్నారు అన్నాడు. అప్పుడు ఆయన “నా పేరు భట్టు, నేను ఖగోళశాస్త్రాన్ని అభ్యసిస్తున్నాను. అని అతనికి ధృవ నక్షత్రం దుర్భిణిలో చూపించాడు. శాతకర్ణి సంతోషించి, నాకు ఒక సందేహం ఉంది ఆకాశంలో మూడు వెలుగులు ఎక్కడ ఉంటాయి. చుక్కలైతే లెక్కపెట్టలేనన్ని ఉంటాయి కదా అని అన్నాడు.
అప్పుడు భట్టు నాయనా, ఇప్పుడు వచ్చే మాసంలో మకర సంక్రాంతి నాడు ఆకాశంలో శబరిమల పైన మూడు కాంతులు దర్శనమిస్తాయి అని చెప్పారు.
అప్పుడు శాతకర్ణి ఆయనకు నమస్కరించి, సెలవు తీసుకున్నాడు. శబరిమల పైకి ప్రయాణం సాగించాడు.
దారి మధ్యలో హనుమంతుని గుడి ఒకటి ఉన్నది. ఆయన ఆ గుడి వద్ద ఆగారు. అక్కడ ఒక యోగిని చూశాడు. అప్పుడు ఆ యోగి శాతకర్ణిని నాయనా ఎవరు నీవు అని అడిగాడు.
అప్పుడు శాతకర్ణి తన దగ్గర ఉన్న సోమవజ్రాన్ని, నీటిని చూపించాడు. అప్పుడు ఆయన నీవు ఇచ్చటకు వచ్చిన పని ఏమిటి అని అడిగారు.
అప్పుడు శాతకర్ణి ఆకాశంలో మూడు వెలుగుల మధ్య ఈ వెలుగు పెట్టాలి, అని చెప్పాడు.
అప్పుడు ఆ యోగి “నాయనా, మకర కలువు అంటే మూడు వెలుగులు, ఆవెలుగులు మకరసంక్రాంతి రోజున కనిపిస్తాయి కానీ ఆ వెలుతురులో ఒక మర్మం ఉన్నది. బ్రహ్మచారి, ఐహిక సుఖాలను వదలి, సాత్వికాహారం భుజించి దీక్షగా దేవుని స్మరించువారికి ఆ మూడు వెలుగులు స్పష్టంగా కనిపిస్తాయి. వెలుగులు క్షణకాలం పాటు ఒక్కొక్కటిగా వస్తాయి.”
“ఆ వెలుగుల నుండి ఒక శక్తి వచ్చి అది చూసిన వారిలో ఒక నూతనోత్తేజం నింపుతుంది.”అని అన్నాడు.
ఆ రోజు మకరసంక్రాంతి..

అప్పుడు శబరిమల శిఖరం పైకి ఎక్కి మూడు వెలుగులను చూశాడు. ప్రమిదలో నీరు పోసి, సోమవజ్రాన్ని వెలిగించాడు తన ఆత్మశక్తితో దీపం వెలిగింది. ఒక్కసారిగా పెద్ద వెలుతురు వచ్చి మూడు వెలుగుల నుండి దీపానికి వెలుతురు వచ్చింది. ఆ వెలుతురు కొండ క్రింది ఒక చోట పడింది. అక్కడ ఒక గుర్రం కనబడింది. సోమవజ్రాన్ని తీసుకుని ఆ గుర్రం మీద ఎక్కి వెళ్ళాడు.
క్రిందకు వచ్చి చూస్తే అక్కడ పెద్ద కొలను ఉన్నది.
కొలను చుట్టుప్రక్కల చూశాడు ఏమీ కనబడలేదు.
కొలను లోపలికి దూకాడు శాతకర్ణి లోపల ఒక గుహలాగా ఉంది. దానికి ద్వారం ఉంది వెలుగు ఆ ద్వారం మీద ఉంది. లోపలి తలుపు తీయగా బయట తలుపు మూసుకుపోయింది, లోపల నీళ్ళన్ని బయటకు వెళ్లిపోయాయి. లోపల ఇంకో ద్వారం ఉన్నది. ద్వారం తీయగానే, ఆ వెలుగు లోపల ఉన్న ఒక వ్యక్తిపై పడింది.
ఆ వ్యక్తి సింహాసనంపై కూర్చుని ఉన్నాడు.

అద్బుతమైన ఆ ముఖవర్చస్సు చూసి ఆశ్చర్యపోయిన శాతకర్ణి నమస్కారం చేసి మహానుభావ మీరెవరూ అని అడిగాడు.
అప్పుడు శ్వేతాంబరధారి అయిన ఆయన మేని బంగారు ఛాయతో వన్నెలీనుతోంది. ఆయన వెండిరంగు గెడ్డం,వస్త్రాల అందాన్ని రెట్టింపు చేస్తున్నది.
అప్పుడు ఆయన నవ్వుతూ,”నాయనా నీ సాహసాలు,అంకుఠిత దీక్ష నాకు నచ్చాయి. నిన్ను ఈ (దేశానికి) జంబూ ద్వీపానికి చక్రవర్తిగా చేయడానికి ఘడియలు దగ్గరకు వచ్చాయి అన్నాడు.అప్పుడు ఆయన నీవు అశ్వమేధయాగం,రెండు రాజసూయ యాగాలు చేస్తావు.నీ కంటే ముందు రఘువంశ నందనుడు ఆ మహాత్కార్యం చేసాడు. ఆయన కంటే ముందు నీను ఆ పని చేసాను.నా పేరు మహాబలి చక్రవర్తి అని చెప్పాడు.నేను మహావిష్ణువు ఆజ్ఞానుసారం పాతాళలోకంలో ఉండి సంవత్సరానికి ఒక సారి ఈ భూమి మీదకు వస్తాను.
నేను, నా స్నేహితుడు ఈ జంబూద్వీపానికి పరిరక్షకులము.పూర్వo దక్షిణ జంబూద్వీపం నిత్యం సముద్రుడు ఆధీనంలో ఉంది, ఎప్పుడూ జీవజాతులు సముద్రుని కోపానికి బలి అవుతూ ఉండేవి. దైవ సంపన్నుడు, దివ్యాంశ శంభూతుడు అయిన పరశురాముడు, దుష్ట క్షత్రియ వధ చేసి, రాజ్యాన్ని స్దాపిoచాలనుకున్నారు. కానీ సముద్రుడు వల్ల ఉన్న ముప్పును ముందే పసిగట్టిన భార్గవరాముడు అతనితో యుద్దం చేసి కట్టడి చేసాడు.

సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన భాధ్యతోను తన నెత్తిన వేసుకున్న పరశురాములవారు అగస్త్యమునితో కలసి కొడంగల్లూరులోని భగవతి అమ్మవారిని ప్రతిష్టించారు.ఆదిశక్తి మహిమ వల్ల అక్కడ గురుకులం స్థాపించి అన్ని శాస్త్రాలను అభివృద్ది చేసారు.”అని అన్నారు.
అప్పుడు మహాబలి శాతకర్ణిని తీసుకుని ఆలయం క్రింద ఉన్న సొరంగ మార్గంలో ఇంకొక భూగర్గ ఆలయంలోకి తీసుకెళ్లారు. అందులో అందరూ ఒక మర్మకళను అభ్యసిస్తున్నారు. అందులో శిక్షణ చాలా కఠినంగా ఉంది.
అది చూసిన శాతకర్ణి, “రాజోత్తమా,మిమ్ముల్లి కలవడం నా జన్మ అదృష్టం, నేనెంతో పుణ్యం చేసుకున్నాను. మీరు మహా గ్రేసరులు, అంతకు మించి మానవోత్తములు.ఈ యుద్దవిధ్య ఏమిటో సెలవివ్వగలరు” అన్నారు.
దీన్ని పరశురాములు వారు అభివృద్ది చేసారు. అగస్త్యముని, ఎంత ప్రయాసలకొర్చి దీన్ని శిష్యులకు నేర్పించారు.
మేమందరం దీనిని కలరి అని పిలుస్తాము. ఇది మానసిక, శారీరక పరిపూర్ణత పొందిన వారే చేయగలరు. మేము చిన్నవయసు నుండి ఈ యుధ్ధకళను నేర్పిస్తాయి. దాంతో వారు పరిపూర్ణ సైనికులవుతారు. వారిని ఈ మహాభారత సామ్రాజ్యానికి పరిరక్షకులుగా నియమిస్తాము.
ఇందులో కొందరు సంఖ్యాశాస్త్రం, ఆర్ధికశాస్త్రం, శల్యశాస్త్రం, వైద్యశాస్త్రంలో కూడా నిష్ణాతులు మన సామ్రాజ్యానికి పునాది రాళ్ళుగా ఉన్న ఈ విజ్ఞులను ఈ భగవతి ఆలయమే తయారు చేసింది.కాలాలు మారినా ఈ దేశాన్ని రక్షించడానికి కొందరు చిరంజీవులను ఈ ఆలయం ఆదేశించింది.అందులో నేను, నా స్నేహితుడు ముఖ్య భూమిక పోషిస్తాము “అన్నారు.
అప్పుడు శాతకర్ణిని చూసి మహాబలి నాయనా నీ తేజస్సు నిన్ను చూస్తుంటే నీ తాత గారు శ్రీముఖుశాలివాహనుని చూస్తున్నట్లుంది. ఆయన మహా తేజోమంతుడు.
అప్పుడు శాతకర్ణి మహాబలితో,” విప్రవర్య, దయచేసి మా తాతగారి గురించి నాకు చెప్పండి “అన్నారు

అప్పుడు శాతకర్ణి మహాబలితో,” విప్రవర్య, దయచేసి మా తాతగారి గురించి నాకు చెప్పండి “అన్నారు.
మహాబలి అప్పుడు ఇలా అన్నారు … “ఈ దేశాన్ని విక్రమాధిత్యుడు వేల సంవత్సరాలు పాలించారు. తన తమ్ముడు భట్టితో కలసి
కొంతకాలానికి సైన్యాధ్యక్షులు అధికారదాహం వల్ల సామంత రాజులు రాజ్యాలను కొల్లగొట్ట సాగారు. అలాగే శ్రీముఖుని తండ్రి రాజ్యాన్ని తగుల బెట్టారు.కోపంతో రగిలిపోయిన 10 ఏళ్ళ శ్రీముఖుడు, విక్రమాధిత్యుని ఓడించడానికి లక్షమంది సైన్యాన్ని తయారు చేసాడు.”
అప్పుడు శాతకర్ణి ఆశ్చర్యపడి ఇది ఎలా సాధ్యం అన్నారు.
అప్పుడు మహాబలి ఇలా సెలవిచ్చారు “నిజం సైన్యం కాదు, మట్టితో చేసిన బొమ్మలు, అతనిని ఒక నాగా సాధువు తీసుకొచ్చి మా వద్ద వదిలాడు, అతని కుండలినిలో మహారాజయోగం ఉంది అని
అప్పుడు అతనిని అరుణాచలంలో బుద్ది బలాన్ని, రిష్య ముఖ పర్వతాలలో భుజ బలాన్ని పెంపొందించుకునేలా సమగ్ర శిక్షణ ఇప్పించాము.విక్రమార్కుని పై యుద్దానికి శ్రీముఖుని సన్నద్దం చేసాము.
మా మిత్రులు ద్వారా లక్షమంది సైన్యాన్ని సమీకరించాము. కానీ విక్రమార్కుని సైన్యం రెండు లక్షలకు పైగా ఉంటుంది.
అందరికీ నాగాసాధువు లక్షమంది సైన్యం, శ్రీముఖుడు తయారు శ్రీముఖుడు చేసిన మట్టిబొమ్మల నుంచి సృస్టించారని వదంతి వ్యాపింప చేసాం.

యుద్ధ భేరి మ్రోగింది .శ్రీముఖుడు ఉరిమి అనే ఆయుధం తో బరిలోకి దిగాడు .
ఒకే పిడిలో ఉన్న మూడు వంగే కత్తులలో చుట్టూరా గోళాకారంలో తిప్పుడూ రధం పైకి ఎక్కి ముందుకు ఉరికాడు శాలివాహనుడు.
శాలివాహనుడు, యుద్దంలో ఉరిమిలో విజృంభిస్తున్నాడు. సైన్యం ప్రక్కనే ఉన్న అడవిలో తలదాచుకున్నారు
పెద్ద ఎత్తున ఉన్న విక్రమార్కుని సైన్యాని నిలువరించలేక పోతుంది కాబట్టి.
ఒకే ఒక్కడు శాలివాహనుడు బయలుదేరారు. అప్పుడు శాలివాహనుడు, చక్రవ్యూహంలోకి అడుగుపెట్టారు.
వ్యూహం మధ్యలో వెళ్ళగానే కత్తులలో 15 మంది చుట్టుముట్టారు.
ఉరిమిని పైకి లేపి, గుండ్రంగా ఒక వేటు వేసాడు శాలివాహనుడు ఉరిమిలోకి కత్తులు, మెరుపుల్లా పదిహేను మందినీ చంపేసాయి.
తేరుకున్న సైనికులు రెండో వలయంలో 30 మంది బాణాలు సంధించారు.
ఉరిమితో వలయాకారంలో ఉరిమి తిప్పుతూ అతి వేగంగా తన చుట్టూ గోళాకారం లో రక్షణవలయాన్ని స్టాపించాడు.
తన మొలలోనించి ఒక కత్తిని తీసాడు.
నెలవంక ఆకారంలో ఉన్న రెండు కత్తులను రెండు వైపులా విసిరాడు శతవాహనుడు. సుదర్శన చక్రం లా రెండు కత్తులూ తిరుగుతూ 30 మందినీ చంపేశాయి, వెంటనే తన చేతుల్లోకి వచ్చేసాయి.
వెంటనే సైన్యం అంతా చక్రవ్యూహం వైపు వచ్చి చుట్టుముట్టారు.
రధంలోనుంచి దూకి మహాబలి ప్రసాదించిన పరశురాముని గొడ్డలి బయటకు తీసారు శ్రీముఖుడు .
వెంటనే గొడ్డలి వేగంగా తిప్పుతూ గాలిలోకి విసిరారు.
ఆకాశంలో ఆ గొడ్డలి వేగంగా గుండ్రంగా తిరుగుతూ ఎర్రగా సూర్యునిలా వెలుగుతూ నిప్పులు రువ్వసాగింది.
ఆ వెలుగుకు అందరూ కుప్పకూలిపోయారు విక్రమార్కునితో సహా.
వెంటనే అడవిలో ఉన్న సైన్యం, అందరినీ బంధించింది.
విక్రమార్కుడు తప్పించుకున్నాడు.
చండప్రచండంగా ఉన్న ఆ గొడ్డలి మళ్ళీ శాలివాహనుడు చేతిలోకి వచ్చింది.
అలా మీ ముత్తాత శాలివాహనుడు అలా విక్రమార్కుని ఓడించి శాలివాహన శకాన్ని స్థాపించారు .
ఆ గండ్రా గొడ్డలిని హిమాలయలకు తీసుకెళ్ళి అమరనాధునితో నిక్షిప్తం చేసాము.
అప్పుడు మహాబలి నాయన అది మీ ముత్తాత కధ అని చెప్పారు.
మహాబలి “నాయినా నీకు కూడా చక్రవర్తి యోగం ఉంది. ఈ దేశాన్ని బయట శత్తులు ఆక్రమిచడానికి పన్నగాలు పన్నుతున్నాయి. వాటిని నీవు నిలువరించాలి.అలా నిలువరించాలి అంటే నీవు చతురంగ బలాలు, నావికా బలాలలో సుసంపన్నం అవ్వాలి.
నావికా బలం పెంపొందాలంటే మన ప్రక్కన ఉన్న సింహళ రాజ్యాన్ని మనం మిత్రులం చేసుకోవాలి.”

77640cookie-checkగౌతమి పుత్ర శాతకర్ణి – Part 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *